యాప్నగరం

ఏపీకి కేంద్ర బృందం.. ఆ జిల్లాల్లో వరద నష్టం అంచనా..

Samayam Telugu 25 Nov 2021, 10:58 pm
వాయుగుండం ప్రభావంతో కురిసిన వరుస వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. రాయలసీమలో వరద బీభత్సానికి 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాగులు పొంగి ఊర్లను ముంచాయి. ఇళ్లు, పశువులు, పంటలు వరద ప్రభావానికి అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
Samayam Telugu ఫైల్


వరదలకు భారీగా నష్టపోయామని కేంద్రం రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో వరద నష్టాన్ని అంచనా వేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఏపీకి రానుంది.

చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కేంద్ర బృందం మూడు రోజుల పాటు పర్యటించనున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అడ్వైజరీ కునాల్ సత్యార్థి నేతృత్వంలో రెండు బృందాలు ఈ మూడు జిల్లాల్లో పర్యటించనున్నాయి.

ఈ నెల 26వ తేదీ శుక్రవారం చిత్తూరు జిల్లాలో ఒక బృందం, 27న శనివారం చిత్తూరు ఒక బృందం, కడప జిల్లాలో మరో బృందం పర్యటించనుంది. 28న ఆదివారం నెల్లూరులో పర్యటించనున్నాయి. మూడు రోజుల వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన అనంతరం 29వ తేదీ బృంద సభ్యులు ముఖ్యమంత్రితో హాజరవుతారని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.