యాప్నగరం

వైఎస్ విజయమ్మ ఛారిటబుల్ ట్రస్టుపై కేంద్రం నిషేధం

వైఎస్ విజయమ్మ పేరుతో నడుస్తున్న ట్రస్టును కేంద్రం నిషేధించింది. దీంతోపాటు తెలంగాణకు చెందిన 90, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 168 ఎన్జీవోలపై మోదీ సర్కారు నిషేధం విధించింది.

Samayam Telugu 18 Nov 2019, 2:31 pm
కేంద్ర ప్రభుత్వం వైఎస్ విజయమ్మ ఛారిటబుల్ ట్రస్టును నిషేధించింది. బాబోయ్.. జగన్‌పై కేంద్రం కత్తి కట్టిందని అనుకుంటున్నారా? కత్తీ లేదు చాకూ లేదుగానీ.. నిబంధనలను పాటించని ఎన్జీవోలను కేంద్రం నిషేధించింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించడంతో.. తెలంగాణకు చెందిన 90, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 168 ఎన్జీవోలపై మోదీ సర్కారు నిషేధం విధించింది. అందులో వైఎస్ విజయమ్మ పేరుతో నడుస్తున్న ఓ ఛారిటబుల్ ట్రస్టు కూడా ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేసింది.
Samayam Telugu sa


ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ 2010 (ఎఫ్‌సీఆర్ఏ) కింద రిజిస్టరై.. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో నడుస్తోన్న చర్చిలు, విద్యా సంస్థలను క్యాన్సిల్ చేసింది. ఈ జాబితాలో సేవా భారతి, హైదరాబాద్ ఆర్క్‌డియోసీజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ ఉన్నాయి.

ఏపీలో రురల్ ఎడ్యుకేషన్ అండ్ డెవల‌ప్‌మెంట్ సొసైటీ, రాయపాటి ఛారిటబుల్ అసోసియేషన, వైఎస్ విజయమ్మ ఛారిటబుల్ ట్రస్ట్, ఫిలడేల్ఫియా జియాన్ మినిస్ట్రీస్, అరుణ మహిళా మండలి తదితర ఎన్జీవోల రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేసింది.

Read Also: ‘జగన్‌ బెయిల్ రద్దు చేయనున్న సీబీఐ?’

విదేశీ నిధులకు సంబంధించి వార్షికాదాయం, ఖర్చుల వివరాలను అందజేయకపోవడమే.. ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడానికి ప్రధాన కారణం. ఎఫ్‌సీఆర్ఏ కింద విదేశీ నిధుల సమాచారాన్ని ఎన్జీవోలు వార్షిక రిటర్నులలో సమర్పించడాన్ని కేంద్ర హోం శాఖ తప్పనిసరి చేసింది.

Read Also: జగన్ ప్రస్తావన.. విజయసాయిరెడ్డికి అమిత్ షా క్లాస్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.