యాప్నగరం

ఏపీలో రూటుమార్చిన చైన్ స్నాచర్లు.. మహిళలూ వీరితో జాగ్రత్త!

ఏపీలో గొలుసు దొంగలు రూటు మార్చారు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలో ఒకే రోజు రెండు సంఘటనలు జరిగాయి.

Samayam Telugu 24 Oct 2020, 10:08 pm
ఆంధ్రప్రదేశ్‌లో చైన్ స్నాచర్లు రూటుమార్చారు. మహిళల మెడలో గొలుసులు తెంచుకుపోయే దొంగలు తమ రూటు మార్చుకున్నారు. పట్టణాలు, నగరాల్లో చైన్ స్నాచింగ్ చేసే ముఠా ఇప్పుడు గ్రామాలను టార్గెట్‌ చేసుకున్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు మండలంలో ఒకే రోజు రెండు చోట్ల చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు జరిగాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పామర్రులో శనివారం ఉదయం 7 గంటల సమయంలో సుబ్బరత్తమ్మ వైష్ణవాలయం ముందు ఉన్న తన ఇంటి నుంచి కిరాణా షాపునకు వెళ్తుండగా దుండగులు బైక్‌పై వచ్చారు. బండిని దగ్గరగా తీసుకురావడంతో ఆమె పక్కకు జరిగింది. అయితే వాలు చూసుకున్న ఆగంతకులు బండి తిప్పి సుబ్బరత్తమ్మ మెడలో ఉన్న దండను లాక్కెళ్లడానికి యత్నించారు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించటంతో బలంగా గొంతునొక్కారు. ఇది గమనించిన మరో మహిళ గట్టిగా కేకలు వేయటంతో దుండగులు పారిపోయారు. ఈ సంఘటన నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో జరగటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

మరో సంఘటన పామర్రు మండల పరిధిలోనే జమీగొల్వేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగమణి ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంట్లోని చెత్తను బయట పారబోసి వస్తుండగా ఆమె మెడలోని రెండున్నర కాసుల బంగారు గొలుసును దొంగలు లాక్కొని పారిపోయారు. ఒకే మండలంలో ఓ చోట దొంగతనం యత్నం, మరో గ్రామంలో జరిగిన దొంగతనం ఒకే మాదిరిగా ఉండటంతో ఈ రెండు ఒకరే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామాల్లో బంగారు గొలుసులు ధరించే మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.