Weather Update: విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో స్వల్పంగా ఎండ తీవ్రత తగ్గనుంది. అలాగే.. శనివారం నాడు అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఆదివారం రోజున గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందునా.. పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని.. చెట్ల కింద ఉండొద్దని విపత్తుల నిర్వహణ శాఖ (APSDMA) అధికారులు హెచ్చరించారు. ఇటు ఐఎండి అంచనాల ప్రకారం.. శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, నాతవరం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం కూడా 10 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
Weather Update: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. రెండ్రోజులు ఉపశమనం
Weather Update: ఈ ఏడాది వాతావరణంలో మార్పులు వేగంగా వస్తున్నాయి. అప్పటిదాకా ఎండ దంచికొట్టి.. వెంటనే మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
ప్రధానాంశాలు:
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు
- పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం
- అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్