యాప్నగరం

మరోసారి చంద్రబాబు దీక్ష.. భౌతిక దూరం పాటిస్తూ నిరసన

అమరావతి ఏ ఒక్కరిది కాదన్నారు చంద్రబాబు నాయుడు. అమారవతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన దీక్షకు దిగారు.

Samayam Telugu 4 Jul 2020, 12:00 pm
మరోసారి నిరసరన దీక్షకు శ్రీకారం చుట్టారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావంగా పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షకు చంద్రబాబు కూర్చొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ చంద్రబాబుతో నిరసన దీక్షలో టీడీపీ నేతలు చినరాజప్ప, నక్కా ఆనంద్ బాబు, కనకమేడల రవీంద్ర కుమార్, అశోక్ బాబు, వర్ల రామయ్య, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతిని ఎవరూ ఏమీ చేయలేరన్నారు చంద్రబాబు. అమరావతి శాశ్వతంగా ఉంటుందన్నారు
Samayam Telugu చంద్రబాబు నాయుడు
chandrababu naidu


ఏపీకి ఆధునికమైన రాజధాని కావాలన్నారు చంద్రబాబు. ఏపీలోని 13 జిల్లాలకు నడిబొడ్డున రాజధాని అమరావతిని నిర్మించాలనుకున్నామన్నారు. రాజధాని కోసం రైతులంతా స్వచ్ఛందంగా వచ్చి రాజధాని కోసం భూములిచ్చారన్నారు. రాజధాని ఏ ఒక్కరి కోసం కాదన్నారు. అమరావతి ఓ పార్టీతో.. వ్యక్తిదో కాదన్నారు. అమరావతి పోరాటానికి అల్లూరియే మనకు స్ఫూర్తి అన్నారు చంద్రబాబు. అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలన్నారు. అమరావతిలో కానీ మరెక్కడైనా కానీ, ప్రజలకు ద్రోహం చేయాలన్నా, వారి భవిష్యత్తును కాలరాయాలన్నా పాలకులు భయపడాలంటే 5 కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పిలుపు నిచ్చారు. అప్పుడే అమరావతి రూపంలో మన ఆత్మగౌరవం నిలబడుతుందన్నారు.

మరోవైపు అమరావతి ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. జేఏసీ నాయకులు రాజధాని కోసం ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మహిళా జేఏసీ నేతలు ఒకరోజు దీక్ష చేశారు. ఈ దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేత బాబూరావు, బీజేపీ నేత గోపాలకృష్ణ, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ సంఘీభావం ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.