Chandrababu: తెలుగు రాజకీయాల్లో చాలామంది ఓ మాట చెబుతారు. మీడియాను తెలుగుదేశం పార్టీ గానీ.. చంద్రబాబు గానీ చాలా గౌరవిస్తారు అని అంటారు. అనేకమంది జర్నలిస్టులకు కూడా ఇదే అభిప్రాయం ఉంటుంది. కానీ.. చంద్రబాబు తొలిసారి మీడియాపై కాస్త ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ (Jagan)ను విమర్శించే క్రమంలో.. కొన్ని మీడియా సంస్థల పేర్లను ప్రస్తావించి ఇవి ఎవరిని చూపిస్తున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. కార్యకర్తలు మాత్రం కేరింత కొట్టారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. పోలవరం (Polavaram) ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లారు. కానీ.. భద్రతా కారణాలతో పోలీసులు అనుమతించలేదు. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని.. ఈ సమయంలో పోలవరం వద్దకు వెళ్లడం కుదరదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తనకు మీడియా సపోర్ట్ లేదని ముఖ్యమంత్రి చెబుతారు. మరి ఇవన్నీ ఎవరిని చూపిస్తున్నాయి' అని కొన్ని మీడియా (Media) సంస్థల పేర్లను ప్రస్తావించారు.
చంద్రబాబు (Chandrababu) ఇలా మాట్లాడటంతో.. అక్కడున్న కార్యకర్తలు ఈలలు వేస్తూ.. కేరింతలు కొట్టారు. అయితే.. చంద్రబాబు గతంలో ఇలా ఎప్పుడూ మాట్లాడలేదని కొందరు ఆయన సన్నిహితులు అంటున్నారు. పార్టీకి చెందిన నేతలు ఎవరైనా మీడియా గురించి మాట్లాడితే చంద్రబాబు మందలించే వారని.. అలాంటిది చంద్రబాబే ఇలా మాట్లాడారేంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేతల మాట ఎలా ఉన్నా.. చంద్రబాబు కూడా జగన్లా సూటిగా మీడియా సంస్థల గురించి మాట్లాడటంతో.. కేడర్ (TDP Cadre) మాత్రం జోష్లో ఉంది.
కేవలం చంద్రబాబే కాదు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ.. ఆ రెండు పత్రికలు అంటూ సెటైర్లు వేసేవారు. ఇప్పుడున్న ఏపీ సీఎం జగన్ కూడా.. చాలా బహిరంగ సభల్లో కొన్ని మీడియా సంస్థల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ.. వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచిస్తారు. ప్రభుత్వంపై అవి నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని సూటిగానే వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ ఒకటి రెండుసార్లు ఒక మీడియా (Telugu Media) సంస్థ గురించి కాస్త ఘాటుగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు అలా మాట్లాడలేదు.
కానీ.. ఏలూరు (Eluru) పర్యటనలో చంద్రబాబు స్వయంగా పేర్లను ప్రస్తావిస్తూ.. మాట్లాడారు. దీంతో కేడర్కు కూడా క్లారిటీ ఇచ్చారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మీడియా విషయంలో చంద్రబాబు కూడా జగన్ (Jagan) బాటలోనే నడిచారు అనే కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
Read Latest Andhra Pradesh News and Telugu News
కేవలం చంద్రబాబే కాదు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ.. ఆ రెండు పత్రికలు అంటూ సెటైర్లు వేసేవారు. ఇప్పుడున్న ఏపీ సీఎం జగన్ కూడా.. చాలా బహిరంగ సభల్లో కొన్ని మీడియా సంస్థల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ.. వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచిస్తారు. ప్రభుత్వంపై అవి నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని సూటిగానే వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ ఒకటి రెండుసార్లు ఒక మీడియా (Telugu Media) సంస్థ గురించి కాస్త ఘాటుగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు అలా మాట్లాడలేదు.
కానీ.. ఏలూరు (Eluru) పర్యటనలో చంద్రబాబు స్వయంగా పేర్లను ప్రస్తావిస్తూ.. మాట్లాడారు. దీంతో కేడర్కు కూడా క్లారిటీ ఇచ్చారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మీడియా విషయంలో చంద్రబాబు కూడా జగన్ (Jagan) బాటలోనే నడిచారు అనే కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
Read Latest Andhra Pradesh News and Telugu News