యాప్నగరం

YS Jaganకు చెక్ పెట్టడం కోసం.. బీజేపీ బాటలో బాబు, కొత్త ప్లాన్ వేసిన టీడీపీ అధినేత

AP Capital: అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించడం కోసం జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచేలా చంద్రబాబు నాయుడు కొత్త ప్రచారానికి తెర తీశారు. మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా అమరావతికి మద్దతు పలకండంటూ ఆయన ట్వీట్ చేశారు.

Samayam Telugu 14 Jan 2020, 6:27 pm
రాజధాని వికేంద్రీకరణ దిశగా జగన్ సర్కారు అడుగులేస్తున్న వేళ.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అమరావతి రైతులకు మద్దతుగా చంద్రబాబు నాయుడు ఆందోళనలు చేపడుతున్నారు. రైతులు ఎంతగా ఆందోళనలకు దిగినప్పటికీ.. జగన్ సర్కారు మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. జనవరి 20న కేబినెట్ భేటీతో నిర్వహించి.. మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది.
Samayam Telugu amaravati jagan babu


ఈ తరుణంలో జగన్ సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు.. అమరావతికి మద్దతు కూడగట్టేందుకు చంద్రబాబు కొత్త ప్రచారానికి తెర తీశారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతు కోసం 84 60 70 80 90 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని చంద్రబాబు కోరారు. జగన్ లాంటి సీఎంలు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఎప్పటికీ అమరావతినే రాజధాని అని బాబు వ్యాఖ్యానించారు.

‘‘పండుగలు ఎన్నోవస్తాయి. కానీ అమరావతి రైతుల కొచ్చిన కష్టం ఏ పండుగకూ రాకూడదు. రాజధాని అమరావతి కోసం, జీవితకాలపు నిజమైన సంక్రాంతి కోసం, అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మీ మద్దతు తెలియజేయండి. 84 60 70 80 90 నెంబరుకు ఒక్క మిస్ డ్ కాల్ ఇచ్చి అమరావతే ఆంధ్రుల రాజధాని అని చాటండి’’ అని బాబు ట్వీట్ చేశారు.

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు మిన్నంటిన వేళ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇలా మిస్డ్ కాల్ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 8866288662 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలపండిన హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రజలను కోరారు. ఇప్పుడు అదే తరహా ప్రచారాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఇదెంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.