యాప్నగరం

హైదరాబాద్ ఆస్పత్రిలో టీడీపీ ఎంపీ.. పరామర్శించిన చంద్రబాబు

Chandrababu Naidu టీడీపీ ఎంపీని పరామర్శించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ అనంతరం కోలుకుంటున్న ఎంపీని కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చంద్రబాబు వెంట ఎంపీలు జయదేవ్, రామ్మోన్‌లు ఉన్నారు. అనంతరం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రధానంగా జీవో నంబర్ 1ను ప్రస్తావించాలని సూచించారు. పోలవరం, పెండింగ్ నిధులతో పాటూ రాష్ట్ర సమస్యల్ని సభలో ప్రస్తావించాలి అన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 30 Jan 2023, 7:26 am

ప్రధానాంశాలు:

  • టీడీపీ ఎంపీకి చంద్రబాబు పరామర్శ
  • కొద్ది రోజుల క్రితం ఎంపీకి బైపాస్ సర్జరీ
  • ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kanakamedala Ravindra Kumar
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) పార్టీ ఎంపీని పరామర్శించారు. హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ అనంతరం కోలుకుంటున్న టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra Kumar)ను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చంద్రబాబు వెంట ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులు ఉన్నారు. ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రవీంద్రకుమార్‌కు కొద్దిరోజుల క్రితం బైపాస్ సర్జరీ చేశారు.. ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన రాష్ట్ర సమస్యలపై పార్టీ అధినేతతో ఎంపీలు చర్చించారు. విభజన సమస్యలు, పోలవరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీవో నెంబర్ 1, లా అండ్ ఆర్డర్ పరిస్థితి వంటి అంశాలపై పార్లమెంట్ లో మాట్లాడాలని చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ కూడా పాల్గొన్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తూ జగన్‌ తీసుకొచ్చిన అప్రజాస్వామిక జీవో 1పై పార్లమెంటులో మాట్లాడాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. కేంద్రం ఇస్తున్న నిధులను ఏపీ సర్కార్ దారి మళ్లిస్తున్న విషయాన్నీ ప్రస్తావించాలని.. పోలవరం ప్రాజెక్టును గాలికొదిలేసింది అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. ప్రభుత్వం అప్రజాస్వామిక జీవోలు తీసుకొస్తూ ప్రజలను అణచివేస్తోంది అన్నారు. అలాగే పంచాయతీ నిధుల్ని దారి మళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని.. వీటిపై పార్లమెంటులో టీడీపీ తరపున ప్రస్తావించాలని సూచించారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.