తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. చంద్రబాబును ఉద్దేశించి మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే, చంద్రబాబు అనుకూల మీడియా అంటూ కొన్ని సంస్థలపై తీవ్ర కామెంట్స్ చేశారు. చంద్రబాబు విదిల్చే ప్యాకేజీ కోసం ఆయన అనుకూల మీడియా ఎగబడిపోతోందని విమర్శించారు.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో పోటీ పడి మరీ ఊహాజనిత కథనాల రొచ్చును వెదజల్లుతున్నాయని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియా పుణ్యమా అని నిజం ఏమిటో, కట్టు కథలు ఏమిటో ప్రజలు తెలుసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీకి మళ్లీ వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.
‘‘బాబు విదిల్చే ప్యాకేజి కోసం ఎల్లో మీడియా ఎగబడిపోతోంది. ఈ మధ్య పోటీ పడి మరీ ఊహాజనిత కథనాల రొచ్చును వెదజల్లుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని నిజం ఏమిటో, కట్టు కథలు ఏమిటో ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు. మళ్లీ వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో పోటీ పడి మరీ ఊహాజనిత కథనాల రొచ్చును వెదజల్లుతున్నాయని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియా పుణ్యమా అని నిజం ఏమిటో, కట్టు కథలు ఏమిటో ప్రజలు తెలుసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీకి మళ్లీ వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.
‘‘బాబు విదిల్చే ప్యాకేజి కోసం ఎల్లో మీడియా ఎగబడిపోతోంది. ఈ మధ్య పోటీ పడి మరీ ఊహాజనిత కథనాల రొచ్చును వెదజల్లుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని నిజం ఏమిటో, కట్టు కథలు ఏమిటో ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు. మళ్లీ వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.