యాప్నగరం

విశాఖ దుర్ఘటనపై స్పందించిన చంద్రబాబు

అర్థరాత్రి జరిగిన విశాఖ విష వాయువు దుర్ఘటనతో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అక్కడ గ్యాస్ లీకేజీతో అనేకమంది రోడ్లపై స్పృహ తప్పిపడిపోయారు. ఇప్పటివరకు 8మంది చనిపోయారు.

Samayam Telugu 7 May 2020, 9:57 am
విశాఖ విష వాయువు దుర్ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటన విని తాను షాక్‌కు గురయ్యామన్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. వందలాదిమంది సైతం అస్వస్థతకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలతా వెంటనే అప్రమత్తం అవ్వాలన్నారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. అక్కడున్న ప్రజలంతా అధికారులు చెప్పినట్లు జాగ్రత్తలు పాటించాలన్నారు.
Samayam Telugu చంద్రబాబు నాయుడు


మరోవైపు నారా లోకేష్ సైతం ఈ ఘటన విని దిగ్భ్రాంతికి గురయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. విశాఖ పరిశ్రమలో ప్రమాదం,పలువురు మృతి చెందిన ఘటన గురించి తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు లోకేష్. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం సహాయం అందించాలన్నారు. సహాయక చర్యల్లో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు లోకేష.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో అర్థరాత్రి భారీ ప్రమాదం జరిగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు విడుదలైంది. ఈ దుర్ఘటనతో పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గ్యాస్ పీల్చి ఉన్న చోటే ఊపిరాడక స్పృహ కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 8కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పిల్లలు, పెద్దలతో ఏడుస్తూ ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు స్థానికులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.