యాప్నగరం

చంద్రబాబుకు క్షీణించిన జ్ణాపకశక్తి.. వరంలా మారిన మతిమరుపు.. ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు!

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 9 Aug 2021, 8:52 pm
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబును ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు క్షీణించిన జ్ణాపకశక్తి సంజీవనిగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ అధికారంలోకి వస్తామన్న భ్రాంతిలో ఉండటం మతిమరుపు పుణ్యమేనని ఎద్దేవా చేశారు.
Samayam Telugu చంద్రబాబునాయుడు
Chandrababu Naidu


చంద్రబాబుకు మతిమరుపు ఒక వరంగా మారిందని విజయసాయి వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం వరుస ట్వీట్లు చేశారు.

‘‘మతిమరుపు ఒక వరం. క్షీణించిన జ్ణాపకశక్తి చంద్రబాబుకు సంజీవనిగా పనిచేస్తోంది. మున్సిపల్, పంచాయతీ, తిరుపతి బై ఎలక్షన్, తాజాగా ఏలూరులో కొట్టుకుపోయినా మళ్లీ అధికారం లోకి వస్తామన్న భ్రాంతిలో ఉండటం మతిమరుపు పుణ్యమే.’’ అని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఇక, సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆదిమ సంస్కృతికి, ఆధునిక సమాజానికి వారధులు ఆదివాసీలు. గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమానికి జగన్ గారి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాలని, వారు ప్రగతి వైపు పయనించాలని కోరుకుంటూ గిరిజనులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.