యాప్నగరం

BJP లో తెలుగు దేశం విలీనం, చంద్రబాబు తీవ్ర చర్చలు.. మంత్రి షాకింగ్ విషయాలు!

తెలుగు దేశం పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నామని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 18 Jul 2021, 6:24 pm
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) విలీనానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని బీజేపీలో విలీనం చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో బీజేపీ, జనసేన కలవబోవని, అలాగే నారా లోకేష్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయనకు తెలుసన్నారు. ఈ క్రమంలో ఒంటరిగా పోటీ చేసి టీడీపీ గెలవదని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ప్రధాని మోదీతో చంద్రబాబు


ఇక, రైతుల ముసుగులో టీడీపీ నేతల నాటకాలాడుతున్నారంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. రెండేళ్లలో 83 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదని, గత ఐదేళ్ల పాలనలో చెల్లించింది.. తాము ఏడాదిలోనే చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులివ్వలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు రూ. 5,056 కోట్లు చెల్లించాలని, ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇస్తామని కొడాలి నాని పేర్కొన్నారు. రైతు రాజులా బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. చంద్రబాబుకు సామాజిక న్యాయం అంటే ఆయన కులానికే న్యాయం చేయడమేనని విమర్శించారు. ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వారికి ఒకేసారి నామినేటెడ్‌ పదవులు ఇచ్చామని, మహిళా సాధికారత కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.