యాప్నగరం

తెలుగు తమ్ముళ్లని నిరాశపర్చిన చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరు ఖాయమైందని.. ఆదివారం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులతో పాటూ కొత్త ప్రెసిడెంట్‌ను ప్రకటిస్తారనుకున్నారు. కానీ తర్వాత అనూహ్యంగా ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్ పేరు తెరపైకి వచ్చింది.

Samayam Telugu 28 Sep 2020, 7:54 am
టీడీపీ అధినేత చంద్రబాబు ఒకింత తెలుగు తమ్ముళ్లను నిరాశపరిచారు. అదేంటని అనుకుంటున్నారా.. అవును నిజమే. ఆదివారం ఏపీ పార్లమెంటరీ అధ్యక్షుల్ని ప్రకటించారు. మొత్తం 25మందికి బాధ్యతలు అప్పగించారు.. యువతతో పాటూ సీనియర్లకు కూడా అవకాశం కల్పించారు. అలాలే సామాజిక వర్గాల సమతూకం పాటించారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని మాత్రం ప్రకటించకుండా ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం కొత్త అధ్యక్షుడ్ని ప్రకటిస్తారని భావించిన తెలుగు తమ్ముళ్లకు నిరాశే మిగిలింది. దసరా రోజు ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
Samayam Telugu చంద్రబాబు


టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరు ఖాయమైందని.. ఆదివారం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులతో పాటూ కొత్త ప్రెసిడెంట్‌ను ప్రకటిస్తారనుకున్నారు. కానీ తర్వాత అనూహ్యంగా ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నారనే చర్చ జరిగింది. కానీ ఇద్దరిలో ఎవర్నీ ప్రకటించలేదు. దీంతో మళ్లీ దసరా వరకు తెలుగు తమ్ముళ్లకు ఎదురుచూపులు తప్పేలా లేవు. అప్పుడైనా కొత్త బాస్‌ను ప్రకటిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

ఇటు తెలుగు యువత అధ్యక్ష పదవిని భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది. దీనికి ముందు రామ్మోహన్‌నాయుడు పేరు తెరపైకి వచ్చింది.. కానీ ఆయన అంత సుముఖంగా లేకపోవడంతో పరిటాల శ్రీరామ్ పేరును పరిశీలిస్తున్నారనే చర్చ జరిగింది. కానీ ఆ పదవికి సంబంధించి క్లారిటీ రాలేదు. తెలుగు యువత అధ్యక్ష పదవిని దసరా నాటికి ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.