యాప్నగరం

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన చంద్రబాబు

పరవాడ సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గ్యాస్ లీకేజీ జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Samayam Telugu 30 Jun 2020, 9:45 am
విశాఖ నగరం మరోసారి ఉలిక్కిపడింది. మరో గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరవాడలో రియాక్టర్ నుంచి బెంజీన్ లీకేజీపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ లీకేజి మరువక ముందే పరవాడ గ్యాస్ లీకేజి దుర్ఘటన బాధాకరమన్నారు. విశాఖలో వరుస గ్యాస్ లీకేజీలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు.
Samayam Telugu చంద్రబాబు నాయుడు
chandrababu naidu


మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చంద్రబాబు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. .... గ్యాస్ లీకేజీ బాధితులకు వెంటనే అత్యున్నత వైద్యసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కెమికల్స్‌లోని రియాక్టర్ నుండి లీకైన రసాయన వాయువు పీల్చి ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సిటీ కమిషనర్ ఆర్కే మీనా పరిశీలించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ వినయ్‌చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద చేరడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదంలో మృతి చెందిన షిఫ్ట్ ఇన్‌చార్జ్ రాగినాయుడు, కెమిస్ట్ గౌరీశంకర్‌ల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.