అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతోంది. దాదాపు రెండు నెలలుగా అన్నదాతలు, మహిళలు రోడ్లపైనే నిరసనలు తెలుపుతున్నారు. దీక్షలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ఇలా ఆందోళనల్లో భాగస్వామ్యం అవుతన్న రైతులకు తోటి రైతులు అండగా నిలిచారు. పొన్నూరు నియోజకవర్గ రైతులు రాజధాని ఉద్యమకారులకు ఉచితంగా కూరగాయలు అందజేస్తున్నారు.
చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, వేజెండ్ల గ్రామాల రైతులు గత 45 రోజులుగా రాజధాని రైతులకు కూరగాయలు సరఫరా చేస్తున్నారు. రెండు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 40వేల విలువ చేసే 30-35 క్వింటాళ్ళ 8 రకాల కూరగాయలను అందజేసి సంఘీభావం తెలుపుతున్నారు. తుళ్ళూరు, మందడం, వెంకటపాలెం, కృష్ణాయపాలెంతో పాటూ మరకొన్ని గ్రామాల్లో.. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్న అమరావతి రైతులకు చేయూతగా కూరగాయలను అందజేస్తున్నారు.
15వసారి కూరగాయలతో అమరావతి వెళ్తున్న రైతులు టీడీపీ ఆఫీస్లో చంద్రబాబును కలిశారు. అనంతరం వాహనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చేబ్రోలు మండలం రైతుల్ని అభినందించారు. అమరావతి రాజధాని ఉద్యమకారులకు కూరగాయలు ఉచితంగా అందించడం సంతోషంగా ఉందని.. తోటి సోదర రైతుల ఉద్యమానికి మద్దతు పలకడంతోపాటు సేవాదృక్పథంతో కూరగాయలు పంపిణీ చేయడం స్పూర్తిదాయకమన్నారు.
చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, వేజెండ్ల గ్రామాల రైతులు గత 45 రోజులుగా రాజధాని రైతులకు కూరగాయలు సరఫరా చేస్తున్నారు. రెండు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 40వేల విలువ చేసే 30-35 క్వింటాళ్ళ 8 రకాల కూరగాయలను అందజేసి సంఘీభావం తెలుపుతున్నారు. తుళ్ళూరు, మందడం, వెంకటపాలెం, కృష్ణాయపాలెంతో పాటూ మరకొన్ని గ్రామాల్లో.. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్న అమరావతి రైతులకు చేయూతగా కూరగాయలను అందజేస్తున్నారు.
15వసారి కూరగాయలతో అమరావతి వెళ్తున్న రైతులు టీడీపీ ఆఫీస్లో చంద్రబాబును కలిశారు. అనంతరం వాహనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చేబ్రోలు మండలం రైతుల్ని అభినందించారు. అమరావతి రాజధాని ఉద్యమకారులకు కూరగాయలు ఉచితంగా అందించడం సంతోషంగా ఉందని.. తోటి సోదర రైతుల ఉద్యమానికి మద్దతు పలకడంతోపాటు సేవాదృక్పథంతో కూరగాయలు పంపిణీ చేయడం స్పూర్తిదాయకమన్నారు.