యాప్నగరం

ఏపీలో చెడ్డీగ్యాంగ్ కలకలం.. ఆయుధాలతో అపార్టుమెంట్లోకి చొరబడి..

ఒకరి చేతిలో రాయి.. మరొకరి చేతిలో రాడ్డుతో దుండగులు అపార్టుమెంట్లోకి చొరబడి అటూ ఇటూ తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గుంటూరు జిల్లాలో కలకలం రేగింది.

Samayam Telugu 24 Oct 2019, 1:40 pm
ఏపీలో చెడ్డీగ్యాంగ్ సంచరిస్తోందన్న ప్రచారంతో కలకలం రేగింది. ఓ అపార్టుమెంట్లోకి చొరబడి దోపిడీకి విఫలయత్నం చేశారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడంతో చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి వేళ ముఖాలకు ముసుగులు కట్టుకుని.. నిక్కర్లు మాత్రమే వేసుకుని అపార్టుమెంట్లో అటూ ఇటూ తిరుగుతున్న ఫొటోలు హల్‌చల్ చేయడంతో గుంటూరు జిల్లా వినుకొండ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Samayam Telugu cheddi


ఒంటిపై నిక్కర్లు.. ముఖాలకు ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ఉన్న సాయి అపార్టుమెంట్‌లోకి అర్ధరాత్రి 3 గంటల సమయంలో ప్రవేశించారు. అపార్టుమెంట్ ప్రహరీ దూకి లోనికి చొరబడ్డారు. ఒకరి చేతిలో రాయి.. మరొకరి చేతిలో రాడ్డు ఉంది. దుండగులు అపార్టుమెంట్ మొత్తం కలియదిరిగారు. వాచ్‌మెన్ గది వద్ద అటూ ఇటూ తిరుగుతూ పరిశీలించారు. ఈ దృశ్యాలన్నీ అపార్టుమెంట్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Also Read: హిందూపురంలో బాలయ్యకు షాక్! కారును అడ్డుకున్న గ్రామస్థులుఆ దృశ్యాలు తెల్లారేసరికి వాట్సాప్‌లో వైరల్ కావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. రాళ్లు, రాడ్లతో వచ్చింది దోపిడీ దొంగలేనని.. పట్టణంలో చెడ్డీగ్యాంగ్ తిరుగుతుందన్న వదంతులు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అపార్టుమెంట్లోకి చొరబడిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. రాత్రివేళల్లో గస్తీ పెంచుతామని.. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇస్తే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడతామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.