యాప్నగరం

జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్.. గుంటూరులో పండగ చేసుకున్న చికెన్ వ్యాపారులు

జనతా కర్ఫ్యూ సందర్భంగా గుంటూరులో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. శనివారం సాయంత్రం రూ.100కి చేరింది. చాలారోజులుగా భారీగా పడిపోయిన చికెన్ ధరలు ఆదివారం కర్ఫ్యూ సందర్భంగా కాస్త పెరగడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 22 Mar 2020, 7:20 am
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఇటీవల కాలంలో చికెన్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలల క్రితం కిలో రూ.150-200 మధ్య ధర పలికిన చికెన్ ఇప్పుడు రూ.30కి పడిపోయింది. చికెన్ తింటే కరోనా వస్తుందన్న వదంతులే ఈ పరిస్థితికి దారి తీసింది. కొన్నిచోట్ల అయితే కోళ్లకు మేత వేయడం కూడా దండగని వ్యాపారులు వాటిని ఉచితంగా పంచేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే వాటిని సజీవంగా పూడ్చిపెట్టేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో ఫౌల్ట్రీ పరిశ్రమకు ఏకంగా రూ.500 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. నష్టాలు ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్యలే గతి అంటూ చాలామంది కోళ్ల పరిశ్రమ వ్యాపారులు, చికెన్ దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చి తమ వ్యాపారం ఎప్పుడు గాడిన పడుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Samayam Telugu ffff


Also Read: కరోనా ఎఫెక్ట్: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బంపరాఫర్

అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ చికెన్ వ్యాపారులకు పండగ తెచ్చింది. ఆదివారమంటేనే మాంసాహారులకు పండగ. అలాంటిది ఆ రోజు ప్రజలెవరూ బయటకు రావొద్దని, షాపులు తెరవద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేయడంతో మాంసాహారులు ఢీలా పడిపోయారు. దీనికి పరిష్కారంగా శనివారమే మాంసాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. ఏపీలోని గుంటూరు నగరంలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు చికెన్ దుకాణాలు కళకళల్లాడాయి.

Also Read: 'కరోనా వైరస్ విషయంలో జగన్ సర్కార్ నిజాలు దాచింది'

జనతా కర్ఫ్యూ సందర్భంగా శనివారం రాత్రి మాంసం, పాల దుకాణాలు కిక్కిరిశాయి. నగరంలోని వివిధ సెంటర్లలోని దుకాణాల వద్ద జనం బారులు తీరారు. దీంతో నిన్నటి వరకు కిలో చికెన్‌ రూ.30 కే అమ్మిన వ్యాపారులు ప్రజలు ఎగబడడంతో అమాంతం ధరలు పెంచేశారు. చికెన్ ధర శనివారం రాత్రి రూ.100 వరకు పలికింది. దీంతో జనతా కర్ఫ్యూ వల్ల ఒక్కరోజైనా తమ వ్యాపారం బాగుపడిందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఏపీలో పెట్రోల్ బంకులు బంద్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.