యాప్నగరం

చిత్తూరులో చైనా యువకుడి అరెస్టు.. విచిత్రమైన కారణం

రూ.5లక్షల సంగతి పక్కన పెడితే తమకు రూ.10కోట్లు నష్టం వచ్చిందని ఆ కంపెనీ చెబుతోంది. కంపెనీ తరపున మేనేజర్ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చైనా యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Samayam Telugu 29 Oct 2020, 6:36 am
చిత్తూరు జిల్లాలో చైనా యువకుడి అరెస్ట్ ఆసక్తికరంగా మారింది. ఏర్పేడు సమీపంలో ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. చైనాకు చెందిన జోయొంగ్ హుయి సంస్థతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.5 లక్షలతో మిషనరీ బిగించేందుకు చెంజెస్ డీల్ మాట్లాడుకున్నారు. ఫాక్స్ కంపెనీలో మిషనరీ బిగించేందుకు ఫాంగ్ చెంజెస్ అనే వ్యక్తి చైనా నుంచి ఇండియా వచ్చాడు.
Samayam Telugu చైనా యువకుడు


కంపెనీలో మిషనరీ బిగించే క్రమంలో అనవసరమైన కేబుళ్ళను చెంజెస్ కట్ చేశాడట. ఇలా చేయడంతో తమ సంస్థకు రూ.10 కోట్లు నష్టం వచ్చిందని చెంజెస్‌పై ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున మేనేజర్ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చైనా యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే కేబుళ్ళను కట్ చేశాడని.. జోయొంగ్ హుయి సంస్థ ప్రేరేపించడం వల్లనే కేబుళ్ళను కట్ చేశాడని ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆరోపిస్తోంది. రూ.5లక్షల సంగతి పక్కన పెడితే తమకు రూ.10కోట్లు నష్టం వచ్చిందని ఆ కంపెనీ చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.