యాప్నగరం

YS Jagan ను చూసి ఆశ్చర్యపోయా.. ఈ 4 ఉన్నవారు సలహాలు తీసుకోరు: చినజీయర్ స్వామి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చినజీయర్ స్వామి ఓ రేంజ్‌లో ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ను ఆశ్చర్యపోయానంటూ..!

Samayam Telugu 7 Feb 2022, 8:14 pm
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై చినజీయర్‌ స్వామి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. శ్రీ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ధి వేడుకల్లో సోమవారం సీఎం జగన్ పాల్గొన్నారు.
Samayam Telugu సీఎం జగన్, చినజీయర్ స్వామి



ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రతి పాలకుడు అందరినీ సమానంగా చూస్తూ వారి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. విద్య, వయస్సు, ధనం, అధికారం.. ఈ నాలుగు కలిగి ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోరని.. కానీ, సీఎం జగన్‌లో ఇవన్నీ ఉన్నా ఎలాంటి గర్వం లేదని చినజీయర్‌ స్వామి అన్నారు. సీఎం జగన్‌ అందరి సలహాలను స్వీకరిస్తారు.. సలహాలను పాటిస్తారని చినజీయర్ స్వామి అన్నారు. వైస్‌ జగన్‌ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు చినజీయర్‌ స్వామి అన్నారు.


ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని చినజీయర్‌ స్వామి గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ తనకు బాగా తెలుసన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకముందు వచ్చి తనను కలిశారని తెలిపారు. అన్ని వర్గాల అభ్యన్నతి కోసం వైఎస్సార్ పని చేశారని కొనియాడారు. అలాగే, ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.