యాప్నగరం

మంత్రి కొట్టు సత్యనారాయణకు దమ్ముందా.. చింతమనేని సవాల్

ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే అమరావతి రైతుల పాదయాత్ర కంటే ఎక్కువమందిని పోగేయాలని ఛాలెంజ్ చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 5 Oct 2022, 10:37 am
ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana)పై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) మండిపడ్డారు. రాజధానిపై మూడు ముక్కలాట ఆడుతుతన్నారని.. అదే మూడు ముక్కలాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దుర్భుద్దితో మంత్రి కొట్టు సత్యనారాయణ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఫేక్ పాదయాత్ర.. ఇదంతా చంద్రబాబే చేయిస్తున్నారని రకరకాలుగా ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణకు దమ్ముంటే రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకంటే ఎక్కువమంది ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని సవాల్ విసిరారు. జనాన్ని పోగు చేసి రైతుల పాదయాత్ర నిజమో.. ఫేకో తేల్చాలన్నారు. అంత జనాన్ని పోగు చేసే దమ్ము కొట్టు సత్యనారాయణకు ఉందా అంటూ ఛాలెంజ్ చేశారు.
Samayam Telugu Chintamaneni Prabhakar


ఎక్కడ మంత్రి పదవి ఊడుతుందో అన్న భయం.. ముఖ్యమంత్రి మెహర్భానీ కోసం మంత్రి కొట్టు సత్యనారాయణ ఇలా పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. రైతుల పాదయాత్ర ఫేకో.. మంత్రి కొట్టు సత్యనారాయణ ఫేకో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడకపోతే మంత్రి పదవి ఊడుతుందని.. సీఎం మెప్పు కోసం ఇలాంటి ఫ్లెక్సీలు కట్టించావా అన్నారు. అసలు రైతుల పాదయాత్ర ఫేక్ అని ఎలా అంటారని మండిపడ్డారు. క్సీలు కట్టించినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఫేక్ కాదన్నారు.

అమరావతి రైతులు చేపట్టిన అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం చేరుకుంది. ఈ క్రమంలో పాదయాత్రకు వ్యతిరేకంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. ఫేక్ రైతులు, ఫేక్ యాత్రికులు.. గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను స్థానిక మంత్రి కొట్టు సత్యనారాయణ ఏర్పాటు చేయించారని టీడీపీ ఆరోపించింది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.