యాప్నగరం

చిత్తూరు: స్కూల్లో చితక్కొట్టుకున్న టెన్త్ విద్యార్థులు.. ఒకరి మృతి

స్కూల్ గ్రౌండ్‌లో చితక్కొట్టుకున్న పదో తరగతి విద్యార్థులు. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు. ఫుట్‌బాల్ విషయంలో గొడవ జరగడంతో ఘర్షణ. గొడవ జరగలేదని చెబుతున్న స్కూల్ టీచర్లు.

Samayam Telugu 20 Feb 2020, 7:12 pm
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. మదనపల్లెలో టెన్త్ విద్యార్థులు ఘర్షణకు దిగారు.. ఈ ఘటనలో ఓ విద్యార్థి చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఆట విషయంలో ముగ్గురి మధ్య వివాదం మొదలయ్యింది.. వాగ్వాదానికి దిగారు. ముగ్గురు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో అశోక్ అనే విద్యార్థి చనిపోయాడు.. మరో విద్యార్థికి గాయాలయ్యాయి.
Samayam Telugu ctr


ఇదిలా ఉంటే విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని.. గ్రౌండ్‌లో ఆడుకుంటూ విద్యార్ధి కుప్పకూలిపోయాడని స్కూల్ టీచర్లు చెబుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు అంటున్నారు. ఇదిలా ఉంటే చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిని కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. అశోక్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.