యాప్నగరం

చిత్తూరు: తండ్రి మృతి.. వాట్సాప్‌లో ఫొటో చూసి కొడుకు సైతం..

చిత్తూరు జిల్లా నల్ల వెంకటయ్యగారి పల్లెలో విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి చెందాడు.

Samayam Telugu 27 May 2020, 6:52 pm
చిత్తూరు జిల్లా రూరల్ మండలం నల్ల వెంకటయ్యగారి పల్లెలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మరణవార్త విన్న కొడుకు గుండెపోటుతో కుప్పకూలి పడిపోయి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. నల్ల వెంకటయ్యగారి పల్లెలో ఆంజనేయుడు నాయుడు (78) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. బెంగళూరులో ఉంటున్న కొడుకు బాబు నాయుడు.. తండ్రి అంత్యక్రియల కోసం బెంగళూరు నుంచి చిత్తూరుకు బయల్దేరాడు.
Samayam Telugu తండ్రి కొడుకుల మరణం


అయితే పలమనేరు అంతర్రాష్ట్ర సరిహద్దులో పోలీసులు బాబు నాయుడును అనుమతించలేదు. దీంతో ఆధారాల కోసం చనిపోయిన తండ్రి ఫోటోను పంపాలని కుటుంబ సభ్యులను కోరారు. దీంతో ఆంజనేయుడు నాయుడు మృతదేహం ఫొటోను కుటుంబ సభ్యులు బాబు నాయుడుకు వాట్సాప్ చేశారు.

అయితే తండ్రి మృతదేహం ఫోటోను చూసిన వెంటనే బాబు నాయుడుకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాబు నాయుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, గంటల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం అలముకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.