యాప్నగరం

బిగ్ అలర్ట్: ఏపీలో వర్షాల బీభత్సం.. ఈ 2 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు!

ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం రెండు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Samayam Telugu 28 Nov 2021, 10:16 pm
వరుస భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సోమవారం (నవంబర్ 29) సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. రాబోయే రెండు రోజుల్లో అవి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


మరోవైపు భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ అనేక గ్రామాలు వరద ముంపులోనే మగ్గిపోతున్నాయి. వర్షాల ధాటికి ఇళ్లులు కుంగిపోతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీని నుంచి బయటపడక ముందే.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ జారీ చేసిన తాజా హెచ్చరికలు ప్రజలకు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.