యాప్నగరం

జగన్ సర్కార్ దూకుడు: అమరావతి భూములపై సీఐడీ కేసులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులకు చిక్కులు!

అమరావతిలో భూముల కొనుగోళ్ల వ్యవహారంలో కీలక మలుపు. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన

Samayam Telugu 23 Jan 2020, 12:13 pm
అమరావతిలో భూముల కొనుగోళ్ల విషయంలో సీఐడీ దూకుడు పెంచింది. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డుదారులపై కేసులు నమోదు చేసింది. మొత్తం 796మంది తెల్ల రేషన్‌ కార్డుదారులపై కేసు ఫైల్ చేశారు. రూ.3కోట్ల చొప్పున భూముల్ని కొనుగోలు చేసినట్టు సీఐడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం నాలుగు స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించింది.
Samayam Telugu amaravati.


ప్రాథమిక సమాచారం మేరకు.. మొత్తం 796 రేషన్‌కార్డుదారులు.. రూ.300కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తంచింది. పెద్ద కాకానిలో 40 ఎకరాలు 43మంది.. తుళ్లూరులో 243 ఎకరాలు కొనుగోలు చేసిన 238మంది.. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలు చేసిన 148మంది.. తాడికొండలో 180 ఎకరాలు ఎకరాలు కొనుగోలు చేసిన 188మంది.. తాడేపల్లిలో 24 ఎకరాలు కొనుగోలు చేసిన 49మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

అసలు కొనుగోలుదారులు ఎవరనేదానిపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. తెల్లరేషన్ కార్డుదారులతో ఎవరు భూములు కొనుగోలు చేయించారనే అంశంపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు మాజీ మంత్రులపైనా కేసులు నమోదు చేసినట్లు వార్తలొస్తున్నాయి. భూముల వివరాలు, కొనుగోలు చేసిన వివరాలపై సీఐడీ ఆరా తీస్తోంది.

గత నెలలో జరిగిన కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని అమరావతి భూములు కొనుగోలు వ్యవహారంపై స్పందించారు. కొంతమంది టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు మంత్రులు, నేతలు తమ డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే సిబ్బంది పేర్లపై భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం త్వరలోనే బయటకు వస్తుందన్నారు.. సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. ఇప్పుడు సీఐడీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.