యాప్నగరం

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు వైసీపీ ఎమ్మెల్యే షాక్

ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను హఫీజ్ ఖాన్ సీరియస్‌గా తీసుకున్నారు. అఖిలప్రియకు సీఐడీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు.. ఆమెను గురువారం విచారణకు పిలిచారు.

Samayam Telugu 24 Sep 2020, 8:16 am
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ షాకిచ్చారు. హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారని అఖిలప్రియ ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను హఫీజ్ ఖాన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అఖిలప్రియకు సీఐడీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు.. ఆమెను గురువారం విచారణకు పిలిచారు. ఈ నోటీసులపై అఖిల ప్రియ స్పందించాల్సి ఉంది.
Samayam Telugu అఖిలప్రియ


కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలే కారణమని భూమా అఖిల ప్రియ అన్నారు. అలాగే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను టార్గెట్ చేశారు. ఇటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో ర్యాలీ చేశారని.. ఎమ్మెల్యేల తీరు చూసి అందరూ నవ్వుతున్నారని.. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం వల్ల 8 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా వచ్చింది అన్నారు. కేసులు పెరగడానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.