Asha Malviya: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. పర్వతారోహకురాలు ఆశా మాలవ్య కలిశారు. సైకిల్పై దేశాన్ని చుట్టివస్తున్న ఆశామాలవ్య.. 25 వేల కిలో మీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలో మీటర్లు పూర్తయిందని ఆశా.. ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. దీంతో ఆశా మాలవ్యను సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) అభినందించారు. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మధ్యప్రదేశ్లోని రాజ్ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య.. మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్లేందుకు సైకిల్ యాత్ర (Cycle Yatra) చేస్తున్నారు. 'సైకిల్పై దేశంలోని 28 రాష్ట్రాల్లో 25 వేల కిలోమీటర్లు తిరగాలన్నది నా లక్ష్యం. ఏపీతో సహా 8 రాష్ట్రాల్లో 8,555 కిలో మీటర్ల ప్రయాణం పూర్తయింది. మహిళా భద్రత, సాధికారత నినాదాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నా' అని ఆశా మాలవ్య వివరించారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News