యాప్నగరం

‘జగన్ జైలుకెళ్లడం పక్కా.. సీఎం రేసులో ఆ నలుగురు’

సీఎం జగన్ కచ్చితంగా జైలుకు వెళ్తారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయన జైలుకు వెళ్తే సీఎం కావాలని నలుగురు ఆశిస్తున్నట్లు తెలిపారు.

Samayam Telugu 28 Jan 2020, 5:13 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితంగా జైలుకు వెళ్తారని నిపుణులు చెబుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ జైలుకెళ్తే సీఎం కావాలని నలుగురు ఉవ్విళ్లూరుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోజా సీఎం పీఠంపై కన్నేశారని అనురాధ వ్యాఖ్యానించారు.
Samayam Telugu Anuradha


అందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును దూషిస్తూ మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం (జనవరి 28) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులను దోపిడీ చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్‌ని ఏమనాలని ఆమె ప్రశ్నించారు.

పైరవీల కోసమే సచివాలయం అంటూ మంత్రి కన్నబాబు చీప్‌గా మాట్లాడుతున్నారని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దుల రెడ్డిగా.. సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా 5 కోట్ల మంది ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మండలిలో 20 మందికి పైగా బడుగు, బలహీనవర్గాల వారే ఉన్నారని, బీసీలను అభివృద్ధి చేస్తామని చెప్పి.. వైసీపీ వారి గొంతు కోస్తోందని విమర్శించారు. మండలి రద్దుపై సీఎం జగన్‌ పునః సమీక్షించి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనురాధ డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.