యాప్నగరం

ఉపాధ్యాయులకు సీఎం జగన్‌ గుడ్ న్యూస్.. అంతా ఆన్‌లైన్‌లోనే..

ఏపీలో ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పచ్చజెండా ఊపారు.

Samayam Telugu 3 Jun 2020, 6:29 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల అనంతరం బదిలీలు చేపట్టాలని సూచించారు. బుధవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.
Samayam Telugu సీఎం జగన్


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూపు సురేష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు.

నాడు-నేడు కార్యక్రమం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. మొదట దశలో 500 కొత్తగా జునియర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘జగన్న గోరు ముద్ద’ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్‌ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆయన ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.