యాప్నగరం

నాన్నే నా బలం.. వైఎస్సార్‌ను తలుచుకుంటూ సీఎం జగన్ భావోద్వేగం..

ఫాదర్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భావోద్వేగం చెందారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Samayam Telugu 21 Jun 2020, 2:31 pm
ఫాదర్స్‌ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకున్నారు. మా నాన్నే నాకు స్ఫూర్తి అంటూ ఆదివారం ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
Samayam Telugu వైఎస్సార్, జగన్


‘‘నాన్నే నాకు ఆదర్శం.. ఆయనే నా బలం. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి. ప్రతి తండ్రి పిల్లల గెలుపు కోసం శ్రమిస్తాడు.. ప్రేమను పంచుతాడు.. వారిలో స్ఫూర్తిని నింపి అండగా నిలుస్తాడు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, మన హీరో. మన జీవితంలోని ఎన్నో విలువైన క్షణాలను నాన్నతోనే పంచుకుంటాం. ఎందరో గొప్ప తండ్రులకు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు’’ అంటూ దివంగత వైఎస్సార్‌తో దిగిన ఫోటోను జతచేశారు.

సీఎం జగన్ చేసిన ట్వీట్‌కు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.