యాప్నగరం

పింఛన్‌దారులు, పేదలకు సీఎం జగన్ గుడ్‌ న్యూస్.. 3 సార్లు ఉచిత రేషన్

YS Jagan Mohan Reddy: రాష్ట్రంలో ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించి మూడు సార్లు రేషన్ సరుకులు అందించాలని సూచించారు.

Samayam Telugu 28 Mar 2020, 8:10 pm
రాష్ట్రంలో ఏప్రిల్‌ 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే ఏప్రిల్‌ 4వ తేదీన నిరుపేదలకు రూ.1,000 చొప్పున పంపిణీ చేస్తామని వెల్లడించారు. శనివారం మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం (మార్చి 29) రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేయాలని సూచించారు.
Samayam Telugu 2


అలాగే ఏప్రిల్‌ 15న మరోసారి బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని, ఏప్రిల్‌ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు నెలలకు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఠంచన్‌గా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.

కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో నాలుగు, విజయవాడలో మూడు, గుంటూరులో రెండు, నెల్లూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలో మూడు, రాజమండ్రిలో ఒకటి, తిరుపతిలో ఒకటి, కర్నూలులో ఒకటి చొప్పున మొత్తం 16 కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.