యాప్నగరం

వారందరికీ కరోనా పరీక్షలు చేయండి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

YS Jagan Mohan Reddy: కుటుంబ సర్వేలో కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు.

Samayam Telugu 17 Apr 2020, 4:00 pm
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కుటుంబ సర్వేలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించిన వారందరికీ కోవిడ్‌- 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. కరోనా వైరస్‌ నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో 40 సంవత్సరాల పైబడి ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని వైద్య శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Samayam Telugu EVpHuK-U4AoYgBz


అలాగే ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే.. నేరుగా కోవిడ్‌ ప్రధాన ఆస్పత్రికి తరలిస్తున్నట్లు అధికారులు సీఎం జగన్‌కు చెప్పారు. ర్యాపిడ్‌ టెస్టు కిట్లు అందుబాటులోకి రావడంతో పరీక్షలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇక క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోసం కొంత మంది డాక్టర్లతో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఇలాగే ఇతర ఎమర్జెన్సీ సర్వీసులకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జిల్లాల్లో గుర్తించిన కోవిడ్‌ ఆస్పత్రులు కాకుండా మిగతా ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ సర్వీసులు కొనసాగేలా చూస్తున్నామన్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 572 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 35 మంది డిశ్చార్జి అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.