యాప్నగరం

గుజరాత్‌లో చిక్కుకున్న 5 వేల మంది ఆంధ్రులు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

YS Jagan Mohan Reddy: గుజరాత్‌లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.

Samayam Telugu 7 Apr 2020, 8:10 pm
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌ డౌన్‌ వల్ల గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వాయువేగంతో స్పందించారు. వారికి అన్ని రకాలుగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ (కోవిడ్ 19) కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ విధించడంతో ఏపీకి చెందిన 5 వేల మంది మత్స్యకారులు గుజరాత్‌లోని వెరావల్‌లో చిక్కుకుపోయారు.
Samayam Telugu 8


అయితే అక్కడ తాము పడుతున్న ఇబ్బందులను వారు ఏపీ ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. వారికి సాయం అందిచాల్సిందిగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సతీష్‌ చంద్రను ఆదేశించారు. దీంతో అధికారులు శ్రీకాకుళం నుంచి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గుజరాత్‌కు పంపించారు.

ఆ బృందం ఏపీకి చెందిన జాలర్లకు వసతి, ఆహారంతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. జాలర్ల యోగ క్షేమాలే తమకు ముఖ్యమని ప్రభుత్వం తెలిపింది. వారు రాష్ట్రానికి తిరిగి వచ్చేంత వరకు వారి బాగోగులు చూసుకుంటామని స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.