యాప్నగరం

ఏపీలో ఆలయ నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్ విరాళం

ఈ ఆలయానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ దంపతులు చేయూత ఇచ్చారు. ఆలయం ముందు భాగంలో మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి విరాళం ఇచ్చారు. ఆలయ నిర్మాణం కూడా పూర్తయ్యింది.

Samayam Telugu 30 Aug 2020, 8:59 am
ఏపీలో ఆలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరాళం ఇచ్చారు.నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ దంపతులు చేయూత ఇచ్చారు. ఆలయం ముందు భాగంలో మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి విరాళం ఇచ్చారు. ఆలయ నిర్మాణం కూడా పూర్తయ్యింది.
Samayam Telugu కేసీఆర్ దంపతులు


శనివారం ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. వాస్తవానికి ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ దంపతులు పాల్గొనాల్సి ఉండగా కరోనా ప్రభావం నిబంధనల దృష్ట్యా హాజరు కాలేకపోయారు. ఆలయ నిర్వాహకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట శిలాఫలకం ఆవిష్కరించారు. ఆలయానికి విరాళం ఇచ్చిన కేసీఆర్ దంపతులకు ఆలయ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌కు భక్తిభావం ఎక్కువ ఆలయాలకు విరాళాలు ఇస్తుంటారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తిరుమల శ్రీవారికి వెంకన్న, విజయవాడ దుర్గమ్మకు మొక్కుకున్నారు. తర్వాత రెండు ఆలయాలకు వెళ్లి ఆ మొక్కులు చెల్లించుకుని బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.