యాప్నగరం

జగన్ పుట్టిన రోజు వేడుకలు.. క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేసిన సీఎం

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో కేక్ కట్ చేసిన జగన్.. సీఎంకు బర్త్ డే విషెస్ తెలిపిన గవర్నర్ హరిచందన్.

Samayam Telugu 21 Dec 2019, 11:09 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు 47వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. బర్త్ డే సందర్భంగా సీఎం జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు.. ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
Samayam Telugu birth day.


ఇటు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం కేక్ కట్ చేశారు.. అనంతరం అధికారులు, మంత్రులు జగన్‌కు కేక్ తినిపించి.. బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రిని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Also: ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్

సీఎం జగన్‌కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌కు పూరి జగన్నాథుడు, తిరుమల వెంకటేశ్వరుడు, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆయన తన డైనమిక్ లీడర్‌షిప్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. సీఎంకు బొకేతో పాటూ బర్త్ డే విషెస్ తెలుపుతూ లేఖ పంపించారు.

ఇటు ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలతో పాటూ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి జగన్‌ తన పుట్టిన రోజు నాడే కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.