యాప్నగరం

ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఆసక్తికర చర్చ!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. రాజ్‌భవన్‌లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 15 Aug 2022, 3:31 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా వ్యవహరించే ముగ్గురు నేతలు ఒకే వేదికను పంచుకోనున్నాను. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సోమవారం సాయంత్రం గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాజ్‌భవన్‌‌లో గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ ఇచ్చే ఇచ్చే తేనీటి విందులో సీఎం, ప్రతిపక్ష నేత, పవన్ కళ్యాణ్ ముగ్గురూ హాజరుకానున్నారు. సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదిక పంచుకోవడంపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీరు ఒకరితో మరొకరు మాట్లాడుకుంటారా? కనీసం పలకరించుకుంటారా.. లేదా? అని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Samayam Telugu సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్


ఢిల్లీలో ఇద్దరూ పాల్గొనాల్సి ఉన్నా..
ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు కలిస్తే అక్కడంతా ఆహ్లాదకర వాతావరణం ఉండేది. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అలాంటి పరిస్థితి లేదు. గత వారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇద్దరూ పాల్గొనాల్సి ఉన్నా కాలేదు. చంద్రబాబు హాజరైనా, సీఎం జగన్ మాత్రం ఢిల్లీలోనే ఉండి కూడా హాజరు కాలేదు. మరుసటి రోజు జరిగిన నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎట్ హోం కార్యక్రమంలో జగన్, చంద్రబాబు హాజరు కానుండటం విశేషం.

జనసేన అధినేత పవన్ సైతం..మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కలుసుకున్నది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలవడం కూడా ఆసక్తికరంగా మారింది. వీరందరి కలయికకు రాజ్‌భవన్ వేదిక కానుంది. అయితే, వీరంతా కలిసి రాజకీయాలను పక్కనబెట్టి మాట్లాడుకుంటారా? లేదా ఎడమొహం.. పెడ మొహంగానే ఉంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.