యాప్నగరం

విశాఖలో సీఎం జగన్.. జీ 20 సదస్సులో అతిథులతో విందు!

విశాఖపట్నంలో జరుగుతున్న జీ 20 సదస్సు తొలి రోజు సమావేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి విశాఖప్నటంకు చేరుకున్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 29 Mar 2023, 12:26 am
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలి రోజు జీ- 20 సదస్సుకు హాజరయ్యారు. అతిథులతో కలిసి సీఎం విందులో పాల్గొన్నారు. అనంతరం వారితో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీ-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడుతూ.. విశాఖలో మీరు గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగిలిస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.
Samayam Telugu జీ 20 సదస్సులో పాల్గొన్న సీఎం జగన్


రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నదే తమ ఉద్దేశమని సీఎం జగన్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు ప్రస్తుతం. 22 లక్షల ఇళ్లు కడుతున్నామని పేర్కొన్నారు. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోందనని తెలిపారు. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్‌ పద్ధతులను సూచించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

ఇళ్ల నిర్మాణాలపై సరైన మార్గనిర్దేశకత్వం అవసరమని.. దీని వల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయని సీఎం జగన్ అన్నారు. దీనిపై మీ నుంచి మంచి ఆలోచనలు కావాలన్నారు. సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలని కోరారు. ఈ అంశంపై చక్కటి చర్చలు చేయాలన్నారు. మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని ఆశిస్తున్నానని సీఎం జగన్‌ తెలిపారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.