యాప్నగరం

ఉపాధి హామీ కూలీలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఇకపై, రోజుకు వేతనం ఎంతంటే!

జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. అలాగే, ఉపాధి హామీ పథకానికి సంబంధించి అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 29 Sep 2022, 7:59 pm
స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్‌డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పని తీరుకు ప్రమాణమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ చేపట్టారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సీఎం జగన్ సమీక్ష జరిపారు.
Samayam Telugu సీఎం జగన్ (ఫైల్ ఫొటో)


గడపగడపకు మన ప్రభుత్వంలో వచ్చిన అంశాలకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రాధాన్యతా క్రమంలో పనులు మొదలు కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అలాగే, అక్టోబర్ 25న ఈ- క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు.

ఇక, ఉపాధి హామీ పథకం కింద కనీసం రూ. 240 వేతనం అందేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే, డిసెంబర్‌ 21వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్‌- 3 కింద డిసెంబర్‌లో ఇళ్ల మంజూరు చేయాలన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.