యాప్నగరం

'ఆయన గారి సంస్కారానికి నా నమస్కారాలు..' అసెంబ్లీలో సీఎం జగన్ సెటైర్లు

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై వస్తున్న విమర్శలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చెక్ పెట్టారు. తాను ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తే అధికారుల అంతా తన చుట్టూ ఉంటారని.. ఇలా అయితే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తాను వెళ్లలేదని చెప్పారు.

Samayam Telugu 26 Nov 2021, 4:30 pm
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై వస్తున్న విమర్శలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చెక్ పెట్టారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తాను ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తే అధికారుల అంతా తన చుట్టూ ఉంటారని.. ఇలా అయితే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తాను వెళ్లలేదని చెప్పారు. తాను పర్యటించడం కన్నా.. వరద బాధితులకు సాయం అందడం ముఖ్యమని అన్నారు. ఆకాశానికి చిల్లులు పడిందానే రీతిలో భారీ వర్షాలు కురిశాయని.. బాధితులకు సాయం అందించడంలో ఎక్కడా వెనుకంజ వేయలేదని సీఎం అన్నారు.
Samayam Telugu అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి


ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసి వ్యాఖ్యలపై జగన్ సెటైర్లు వేశారు. 'నేను గాల్లోనే వచ్చి.. గాల్లోనే పోతానని.. ఎక్కడో ఒక చోట శ్వాశతంగా కనుమరుగు అవుతానని.. తనను వ్యతిరేకించిన వైఎస్సార్ గారు కూడా కాలగర్భంలో కలిసి పోయారంటూ ప్రతిపక్ష నాయకుడు ఇలాంటి మాట్లాడారు..' అని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన వెళ్లింది దేనికోసం..? ఆయన మాట్లాడుతుంది ఏంది..? ఆయన గారి సంస్కారానికి నా నమస్కారం.. అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 3 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు రాయలసీమను ముంచెత్తాయని చెప్పారు. తిరుమల మాఢవీధులు, తిరుమతి పట్టణంలో కనీవిని వర్షం కురిసి వాహనాలు కొట్టుకుపోయాయని అన్నారు. కొన్ని చోట్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందని.. తాము వరద నష్టం వివరాలు ఎక్కడా దాచలేదని సీఎం స్పష్టం చేశారు. కష్టాలలో ఉన్న వారికి సాయమందించడంలో ఏ మాత్రం వెనుకాడడం లేదన్నారు.

'కడప జిల్లా పింఛా, అన్నమయ్య రిజర్వాయర్ల దిగువ భాగంలో భారీ సంభవించింది. పింఛా రిజర్వాయర్‌లో మూడు స్పిల్ వే గేట్లు, రెండు అత్యవసర గేట్లు ఎత్తినా.. వరద అంతకు మూడు రెట్లు అధికంగా వచ్చింది. ఇలా పింఛా జలశయం నుంచి వచ్చిన వరద నీరు కట్టడితెంచుకుని అన్నమయ్య రిజర్వాయర్‌పై పడింది. . 2, 3 గంటల వ్యవధిలోనే వరద వచ్చి చేరింది. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు నీరు రాకముందే అధికారులు ప్రజలకు అప్రమత్తం చేశారు. 1250 కుటుంబాలను అప్రమత్తం చేసి.. 450 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు.. 900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం..' అని సీఎం జగన్ తెలిపారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నా.. ప్రతిపక్ష నాయకుడు విమర్శలు గుప్పించడం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.