యాప్నగరం

మీ అంద‌రి చ‌ల్లని దీవెన‌ల‌తో అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు.. సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నాలుగేళ్ల పరిపాలనపై ట్వీట్ వేశారు. ఎన్నిక‌ల టైంలో తాను ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్కటిగా అమ‌లు చేశామని పేర్కొన్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 24 May 2023, 1:25 am
Samayam Telugu నాలుగేళ్ల పాలనపై సీఎం జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో 2019లో భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నాలుగేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రతో ప్రజల్లోకి చొచ్చుకుపోయిన జగన్మోహన్ రెడ్డికి.. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 50 శాతానికి పైగా ఓట్లు, 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్‌సభ స్థానాలు సాధించిన సీఎం జగన్.. ప్రజలకు సంక్షేమ పరిపాలన అందిస్తున్నారు.

మరోవైపు, చంద్రబాబునాయుడు నాయకత్వం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలు సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం తన నాలుగేళ్ల పరిపాలనపై సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్‌ చేశారు.


దేవుడి ద‌య‌, ప్రజలంద‌రి చ‌ల్లని దీవెన‌ల‌తో నాలుగేళ్ళ క్రితం మ‌న ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిందని సీఎం జగన్ తెలిపారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను వారికి సేవ చేసే అవ‌కాశంగా భావించి, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను మ‌న ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమ‌లు చేశామని పేర్కొన్నారు. మ‌రోసారి ప్రజలకు సేవ చేసే అవ‌కాశం ల‌భించేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.