యాప్నగరం

విశాఖపట్నం, అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటన.. జపాన్ టైర్ల కంపెనీ ప్రారంభం

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నం, అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్‌కు చెందిన టైర్ల కంపెనీని ప్రారంభించనున్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 15 Aug 2022, 6:36 pm
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన వివరాలను సీఎంవో అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30 కు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చేరుకోనున్నారు.
Samayam Telugu సీఎం జగన్ (ఫైల్ ఫొటో)


అక్కడ జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీని సీఎం జగన్ ప్రారంభిస్తారు. రూ. 2,350 కోట్లతో ఈ కంపెనీ ఎర్పాటు కానుంది. సుమారు రూ.1,152 కోట్ల పెట్టుబడులతో తొలి దశ యూనిట్‌ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లును పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పరిశీలించారు. అనంతరం మరికొన్ని పరిశ్రమలకు కూడా సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు.

తర్వాత, మధ్యాహ్నం 12.40 గంటలకు అచ్యుతాపురం నుంచి విశాఖపట్నం బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు మర్రిపాలెంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ నివాసానికి చేరుకొని.. ఇటీవల వివాహమైన నూతన వధూవరులను సీఎం జగన్‌ ఆశీర్వదించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ తిరిగి తాడేపల్లి చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.