యాప్నగరం

విభజనతో నష్టపోయాం.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి: జగన్

Narendra Modi | విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి కోలుకునేందుకు సాయం చేయాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భోగాపురం విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టు, కొత్త వైద్య కాలేజీలకు సాయం అంశాన్ని ప్రస్తావించారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 4 Jul 2022, 8:21 pm
YS Jagan Mohan Reddy | విభజన వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సాయం అందించాలని.. తిరిగి కోలుకునేందుకు ప్రత్యేక హోదా (AP Special Status) ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాయం అందించాలని కోరారు. మన్యం దొర అల్లూరి సీతారామ రాజు జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం (జులై 4) భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరుతుండగా వీడ్కోలు పలికిన సీఎం జగన్.. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీకి ఓ మొమోరాండం సమర్పించారు.
Samayam Telugu ప్రధాని మోదీకి వినతిపత్రం అందజేస్తున్న సీఎం జగన్
CM YS Jagan with PM Narendra Modi


తెలంగాణ డిస్కంలు ఏపీకి చెల్లించాల్సిన రూ. 6,627 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్‌ విజ్ఞప్తి చేశారు. ‘రీసోర్స్ గ్యాప్‌ గ్రాంట్‌ అంశం గురించి వినతి పత్రంలో ప్రస్తావించిన వైఎస్ జగన్‌.. గ్రాంట్‌లో భాగంగా రావాల్సిన రూ.34,125 కోట్లు ఇవ్వాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు రూ.55,548 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టుకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. ఏపీఎండీసీకి ఇనుప గనుల కేటాయింపుపై వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.

జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఇచ్చే రేషన్‌లో లోపాలు ఉన్నాయని.. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. చట్టాన్ని సవరించి ఏపీకి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.