యాప్నగరం

ఢిల్లీ పర్యటనకు వైఎస్ జగన్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటి

సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలవనున్నారు.

Samayam Telugu 5 Aug 2019, 11:09 pm
సీఎం వైఎస్ జగన్‌ మంగళవారం (ఆగస్టు 6) ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలతో పాటు పీపీఏలపై సమీక్ష, పోలవరం ప్రాజెక్టు నిధుల అంశాలపై వారితో చర్చించనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు.
Samayam Telugu CM jagan
సీఎం వైఎస్ జగన్


పోలవరం ప్రాజెక్టు పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించడానికి దారితీసిన పరిస్థితులను ప్రధాని మోదీకి జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం 2.30 గంటలకు హోం మంత్రి అమిత్‌ షాతో, సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు.

బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, 11.30 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సీఎం జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు.

జెరూసలెం పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్.. సోమవారం మంత్రులు, అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గోదావరి వరదలు, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. వరద బాధితులను ఆదుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.