యాప్నగరం

రోజా వర్సెస్ డిప్యూటీ సీఎం.. చిత్తూరు జిల్లాలో వేడెక్కిన రాజకీయం

నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా ఆకస్మికంగా పర్యటించారట.

Samayam Telugu 26 May 2020, 1:11 pm
ఎమ్మెల్యే రోజా వర్సెస్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చిత్తూరు జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నగరి నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటించారని.. తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేవారు. తనకు చెప్పకుండా ఎలా పర్యటిస్తారని ఆమె ప్రశ్నించారట. తాను నియోజకవర్గంలోనే అందుబాటులో ఉన్నా కూడా తనను పట్టించుకోకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారన్నారట.
Samayam Telugu చిత్తూరు జిల్లా రాజకీయం


నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా ఆకస్మికంగా పర్యటించారట. అంబేద్కర్ సంఘం తరపున దళితులకు కళ్యాణ మండపం నిర్మాణానికి స్థల సేకరణ కోసం వెళ్లారు.. అక్కడ పుత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఖాళీ భూమిని పరిశీలించారు. తని నియోజకవర్గానికి వస్తున్నా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారట. గతంలో కూడా రోజా-నారాయణ స్వామి మధ్య ప్రోటోకాల్ వివాదం నడిచిందనే టాక్ వినిపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.