యాప్నగరం

కృష్ణాలో బైక్‌ను ఢీకొట్టిన కాలేజీ బస్సు.. ఇద్దరిని ఈడ్చుకెళ్లి..

కళాశాల బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 18 Feb 2020, 3:06 pm
ద్విచక్ర వాహనాన్ని కళాశాల బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఈ దారుణం చోటుచేసుకుంది. కంచికచర్ల మండలం నక్కాలంపేటకు కల్యాణపు హరికృష్ణ(47) వరుసకు కొడుకు అయ్యే పెద్ది రాంగోపాల్‌ (24)ను తీసుకుని స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న కుమార్తెకు భోజనం అందించడానికి బయల్దేరారు.
Samayam Telugu accident


Also Read: పీకే అంటే పిచ్చి కుక్క, అచ్చెన్న అచ్చోసిన ఆంబోతు.. వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

అమృత ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్లే రోడ్డు వైపు ద్విచక్ర వాహనాన్ని మళ్లించారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన అమృత కళాశాలకు చెంది బస్సు వారిని ఢీకొట్టి.. కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న రాంగోపాల్‌, హరికృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

ఈ సమాచారం అందుకున్న కంచికచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను కంచికచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాబాయి హరికృష్ణ ఇంటికి రాంగోపాల్‌ పెనుగంచిప్రోలు నుంచి చుట్టపుచూపుగా వచ్చి ఇలా మృత్యువాత పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Also Read: యువతకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.