యాప్నగరం

ఏ కులాన్నీ టార్గెట్ చేయలేదు.. క్షమించండి: రాజీనామా అనంతరం పృథ్వీ

శబరిమలై నుంచి దిగుతున్నప్పుడే నాపై పెద్ద కుట్ర ప్లాన్ చేస్తున్నారని మీడియా మిత్రులు చెప్పారు. కానీ ఇంత జరుగుతుందని ఊహించలేదంటూ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 12 Jan 2020, 9:27 pm
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సినీనటుడు, వైసీపీ నేత పృథ్వీ అమరావతి రైతులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులని చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అమరావతి రైతులందరినీ తాను అనలేదని... బినామీ ముసుగులో ఉన్న కార్పొరేట్ రైతులను ఉద్దేశించే పెయిడ్ ఆర్టిస్టులు అన్నానని స్పష్టం చేశారు.
Samayam Telugu prudhvi


రైతు కుటుంబం నుంచే తాను కూడా వచ్చానని మరోసారి చెప్పిన పృథ్వీ.. అమరావతి రైతులందరినీ పెయిడ్ ఆర్టిస్టులని అనలేదని అన్నారు. తానేమీ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయలేదని.. పార్టీ స్టాండ్ ప్రకారమే కేవలం కార్పొరేట్ రైతులనే విమర్శించానన్నారు. కానీ ఆ వ్యాఖ్యలపై ఇంత రాద్ధాంతం జరుగుతుందని ఊహించలేదన్న పృథ్వీ.. ఒరిజినల్ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నానన్నారు.

Also Read: పృథ్వీ ప్రెస్‌మీట్‌: స్వామివారిపై ఒట్టేసి చెబుతున్నా.. అదే నిజమైతే నాశనమైపోతా.!

‘రాజధాని రైతులను హేళన చేసేంత కుసంస్కారిని కాదు. తాను రైతు కుటుంబం నుంచే వచ్చాను. వ్యవసాయం గురించి నాకు తెలుసు. శబరిమలై నుంచి దిగుతున్నప్పుడే నాపై పెద్ద కుట్ర ప్లాన్ చేస్తున్నారని మీడియా మిత్రులు చెప్పారు. నా వాయిస్ ఎదుగుతుందంట. మిమ్మల్ని తొక్కేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. నేనేమైనా రౌడీషీటర్‌నా? నాపై ప్లాన్ చేయడానికని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఇంత జరుగుతుందని ఊహించలేదు.’ అని పృథ్వీ వ్యాఖ్యానించారు.

Read Also: జగన్ అభిమానమే కాదు.. ఆగ్రహమూ రుచి చూసిన నటుడు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.