యాప్నగరం

బీజేపీ మంత్రిలా ఏపీ ముఖ్యమంత్రి జగన్.. మాజీ మంత్రి!

గోదావరి వరద జలాలు మళ్లింపు, విభజన చట్టంలో ఆస్తుల, అప్పుల పంపకంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రయత్నాలను విపక్షాలతోపాటు ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

Samayam Telugu 3 Aug 2019, 10:09 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనా విధానంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి సాకె శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. విజయనగరంలో శుక్రవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ నేతలు, కార్యకర్తలనే గ్రామాల్లో వాలంటర్లుగా ప్రభుత్వం నియమిస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి చేస్తున్న అప్రజాస్వామిక పాలనపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు మాట్లాడకపోవడం శోచనీయమని విమర్శించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దేశంలో కులమతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని శైలజానాథ్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ మంత్రిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ధ్వజమెత్తారు.
Samayam Telugu congress


రాష్ట్ర ఆస్తులను తెలంగాణకు ఇచ్చే స్థితికి వచ్చారని మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి చెందిన గోదావరి నీటిని తెలంగాణకు ఇవ్వడంలో జగన్‌ ఉద్దేశం ఏంటో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. గత 14 ఏళ్లలో ఉద్యోగులకు జీతాలు లేకుండా ఎన్నడూ లేదని వ్యాఖ్యానించారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని శైలాజానాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డీసీసీ అధ్యక్షులు యడ్ల ఆదిరాజు, కె.జగన్‌, నాయకులు శ్రీను, సతీష్‌, సుంకర సన్యాసినాయుడు, శ్రీనువాసరావు, రామునాయుడు, నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.