యాప్నగరం

Mp Madhav కు కొత్త చిక్కు.. ప్రధాని సహా, ఢిల్లీలో మరో తలనొప్పి

Mp Madhav Video వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే జాతీయ మహిళా కమిషనర్ సీరియస్ కాగా.. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ ఎంపీ లేఖ రాశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 12 Aug 2022, 7:01 am

ప్రధానాంశాలు:

  • ఎంపీ మాధవ్ వీడియోపై ఢిల్లీలో పంచాయితీ
  • ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ లేఖ
  • ఈ వ్యవహారంపై విచారణ జరపాలన్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gorantla Madhav Video
ఏపీలో వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Mp Madhav Video) దుమారం కొనసాగుతోంది. ఇప్పటికే అనంతపురం ఎస్పీ ఈ వీడియోపై క్లారిటీ ఇవ్వగా.. తాజాగా ఈ వ్యవహారం ఢిల్లీలో హీట్ పెంచింది. తాజాగా ఎంపీ మాధవ్ వీడియో ఎపిసోడ్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ జస్బీర్‌సింగ్ గిల్ లేఖ రాశారు. అలాగే లోక్‌సభ స్పీకర్, జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు ఎంపీ లేఖ రాశారు. మాధవ్ వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని లేఖలో ప్రస్తావించారు.
ఈ వ్యవహారం పార్లమెంట్ ఎంపీలకు మాయని మచ్చలా ఈ వ్యవహారం ఉందని.. ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అంటున్నారని ఘాటుగా స్పందించారు. గోరంట్ల వీడియో ఫోరెన్సిక్‌కు వెళ్లిందని ఎంపీ భరత్ అన్నారని.. ఈ వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎంపీ జస్బీర్‌సింగ్ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఎంపీ మాధవ్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. అలాగే మాధవ్ వీడియో వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్‎ సీరియస్ అయ్యింది.

ఏపీ తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో కమిషన్ స్పందించింది. తక్షణమే ఈ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు. అంతేకాదు స్వంతంత్ర దర్యాప్తు జరిపించి వీలైనంత త్వరగా కమిషన్‎కు నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీకి రేఖా శర్మ మరో లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఢిల్లీకి చేరడంతో ఎంపీకి మరో తలనొప్పి మొదలైందని చెప్పాలి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.