యాప్నగరం

కరోనా రెడ్‌జోన్‌లోకి సీఎం జగన్ నివాసం.. మహిళ మరణంతో టెన్షన్!

తాడేపల్లి పాత టోల్ గేట్ వద్ద మారుతి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే మహిళ అనారోగ్యంతో చనిపోయింది. మృతి చెందిన అనంతరం టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.

Samayam Telugu 18 Apr 2020, 12:01 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం కరోనా రెడ్‌జోన్‌లోకి వెళ్లింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనాతో మహిళ చనిపోవడంతో.. రెడ్‌జోన్‌గా ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ అధికారులు మార్కింగ్‌ వేశారు. తాడేపల్లి పాత టోల్ గేట్ వద్ద మారుతి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే మహిళ అనారోగ్యంతో చనిపోయింది. మృతి చెందిన అనంతరం టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కూతవేటు దూరంలోనే మృతి చెందిన మహిళ నివాసం ఉండే అపార్ట్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu cm house


అటు రెండు రోజుల క్రితం తాడేపల్లిలోని డోలాస్ నగర్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మంగళగిరి కమర్షియల్‌ టాక్సెస్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. తాడేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ నివాసం ఉంటున్నాడు. అతడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తేలింది. ఆ అపార్టుమెంట్‌లో వ్యక్తులు బయటకు రాకుండా నిబంధనలు అమలు చేస్తున్నారు. అపార్టుమెంట్‌లో పనిచేసే వాచ్‌మెన్‌.. ఇళ్లలో పనిచేసే వారి వివరాలు సేకరించి పలువురిని క్వారెంటైన్‌‌కు తరలించారు. ఆ ప్రాంతంవైపు ఎవర్నీ వెళ్లనీయకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు. దీంతో జగన్ నివాసం గురువారం రోజు బఫర్ జోన్‌లో ఉంది.. ఇప్పుడు కరోనాతో మహిళ చనిపోవడంతో రెడ్‌జోన్‌గా మార్చారు అధికారులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.