యాప్నగరం

గుంటూరు: మంగళగిరి ఎన్నారై ఆస్పత్రి పై నుంచి దూకిన కరోనా రోగి

గుంటూరు మారుతీనగర్‌కు చెందిన 66 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ తేలింది. అతడు ఎన్నారై ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

Samayam Telugu 14 Aug 2020, 10:04 am
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని ఎన్నారై ఆస్పత్రి భవనంపై నుంచి కరోనా రోగి దూకాడు. గుంటూరు మారుతీనగర్‌కు చెందిన 66 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ తేలింది. అతడు ఎన్నారై ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఏం జరిగిందో ఏమో శుక్రవారం ఉదయం భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది గమనించి ఐసీయూకు తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. కరోనా భయంతోనే.. మరేవైనా కారణాలతో దూకాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu మంగళగిరి ఎన్నారై


మంగళగిరి మాత్రమే కాదు మరికొన్ని చోట్ల ఇలాంటి ఘటనలే జరిగాయి. కరోనా భయంతో కొంతమంది రోగులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ వైరస్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. అయినా సరే కొంతమంది మాత్రం భయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.