యాప్నగరం

కడపలో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్..

రెడ్‌ జోన్‌లో విధులు నిర్వహిస్తున్నసమయంలోనే ఆ కానిస్టేబుల్‌కు కరోనా సోకి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కానిస్టేబుల్‌ ఎవరిని కలిశాడు, ఏయే ప్రాంతాల్లో తిరిగాడో అధికారులు ఆరా తీస్తున్నారు.

Samayam Telugu 22 Apr 2020, 3:17 pm
ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతున్నాయి. తాజాగా కడపలో ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ తేలింది. టూటౌన్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కడపలోని రెడ్‌ జోన్‌ ప్రాంతంలో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉంది. రెడ్‌ జోన్‌లో విధులు నిర్వహిస్తున్నసమయంలోనే ఆ కానిస్టేబుల్‌కు కరోనా సోకి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కానిస్టేబుల్‌ ఎవరిని కలిశాడు, ఏయే ప్రాంతాల్లో తిరిగాడో అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ కానిస్టేబుల్‌ సీఐ దగ్గర పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.. అతడి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
Samayam Telugu kdp


రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు మొత్తం 813కు చేరాయి. బుధవారం కొత్తగా మరో 56 కేసులు నమోదైనట్లు బులిటెన్‌‌లో తెలియజేశారు. గుంటూరు జిల్లాలో 19, కర్నూలు జిల్లా 19, చిత్తూరు జిల్లా 6, కడప జిల్లా 5, ప్రకాశం జిల్లా 4, కృష్ణా జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 100మందికిపైగా నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 24మంది చనిపోయారు. కడప జిల్లాలో 51 కేసులు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.